మహానగరం హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరిట మూడు నగరాలతో వెలిగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం మానస పుత్రికగా నాలుగో సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ పరిధిలో సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ లేదా ఫోర్త్సిటీకి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’గా పేరుపెట్టింది. ఇటీవలే ఈ ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు అనుసంధానం కోసం ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోరైలు అనుసంధానానికి వేగంగా చర్యలు చేపడుతోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సహా 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) ఏర్పాటు చేసింది. ఆయా మండలాలు, గ్రామాలను ఎఫ్సీడీఏ పరిధిలోకి తీసుకొచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో అనేక హంగులు, సౌకర్యాలతో ఆర్గానిక్ పార్మ్ ల్యాండ్ ‘నందనవనం’ రెడీ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల హబ్గా రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఈ నందనవనం ఏర్పాటైంది. ఆర్గానిక్ వనం నందనవనంలో 5 గుంటలు అంటే 605 చదరపు గజాలు, 10 గుంటలు అంటే 1210 చదరపు గజాల చొప్పున ఫార్మ్ ల్యాండ్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. నాగార్జునసాగర్ హైవేకి కేవలం 5 కిలోమీటర్లు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు 12వ ఎగ్జిట్కు 35 కిలోమీటర్ల దూరంలో నందనవనం ఫార్మ్ ల్యాండ్ ఉంది. త్వరలో ఏర్పాటయ్యే రీజినల్ రింగ్ రోడ్డుకు 9 కిలోమీటర్ల లోపలే ఉన్న ఈ ప్రాజెక్టులో ఫార్మ్ ల్యాండ్ యూనిట్లు కొనుగోలు చేసిన పలువురు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్సిటీకి మెట్రో సేవలు, ఎలక్ట్రిక్ బస్ రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇదే సిటీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే ఫ్యూచర్సిటీలో ఏర్పాటవుతున్న మెడికల్ హబ్ను గ్రీన్ మెడికల్ హబ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక గ్రీన్ మెడికల్ హబ్ త్వరలో సాకారం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫ్యూచర్ సిటీకి కిలోమీటర్ దూరంలో వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ డెవలప్ చేసిన కొన్ని ఫార్మ్ యూనిట్లను పలువురు ఔత్సాహికులు కొనుగోలు చేశారు. వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ సంస్థే మరో కొత్త ప్రాజెక్టు నందనవనాన్ని కొత్తపల్లి సమీపంలో అభివృద్ధి చేసింది. ఫార్మాసిటీకి అతి సమీపంలో ‘నందనవనం’ ప్రాజెక్టు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ముచ్చెర్ల ఫార్మాసిటీకి కేవలం కిలో మీటర్ దూరంలో నందనవనం ప్రాజెక్టు నెలకొంది.
వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ‘నందనవనం’ ఫార్మ్ ల్యాండ్లో చదరపు గజం రూ.4,999 ధరకే లభిస్తోంది. ఈ ప్రాజెక్టులో యూనిట్లు కొన్న వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది. నందనవనంలో ఫార్మ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన వారికి పట్టాదారు పాస్ బుక్ లభిస్తుంది. ఈ వెంచర్లో యూనిట్ల యజమానులు రైతు బంధు పథకానికి అర్హులవుతారు.
నందనవనం ప్రాజెక్టు స్పెషాలిటీ ఏమిటంటే..
- నందనవనం ఫార్మ్ ల్యాండ్ చుట్టూ మేనేజ్మెంటే కట్టుదిట్టమైన ప్రహారీగోడ నిర్మించింది.
– నందనవనంలో మామిడి, సపోటా, నిమ్మ, నేరేడు, జామ, సీతాఫలం, గూస్ బెరి, పనస, కొబ్బరి లాంటి పలు రకాల పండ్లు, కాయల మొక్కలను ఆర్గానిక్ పద్ధతిలో ప్రాజెక్టు యాజమాన్యమే డెవలప్ చేస్తుంది.
– ప్లాట్లు కొన్నవారు వారాంతాల్లో ఆహ్లాదంగా సమయం గడిపేందుకు నందనవనాన్ని సందర్శించవచ్చు. తమ ప్లాట్లో పండిన పండ్లు, కాయలు కోసుకొని, ఆనందంగా తీసుకెళ్లవచ్చు.
- నందనవనం ప్రాజెక్టులో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీటి సదుపాాయం, విద్యుత్, రోడ్డు సౌకర్యాలు ఇప్పటికే కల్పించింది.
- ఈ ఫార్మ్ ల్యాండ్ను వీఈఆర్ నందనవనం ప్రాజెక్టు మేనేజ్మెంటే ఐదేళ్ల పాటు ఉచితంగా నిర్వహిస్తుంది. ఇందుకు కొనుగోలుదారులు అదనంగా రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
– నందనవనం ప్రాజెక్టుకు పూర్తిగా నిరంతరం పటిష్టమైన భద్రత కూడా సంస్థే ఏర్పాటు చేసింది.
– స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ కల్పిస్తుంది.
– వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ ప్రాజెక్టులో ఫార్మ్ ల్యాండ్ యూనిట్లు కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు 7396394749 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు. లేదా www.veragrofarms.com లో వివరాలు తెలుసుకోవచ్చు.
– నందనవనంలో ఫార్మ్ ల్యాండ్ కొంటే పెట్టుబడికి తగిన ఎదుగుదల ఉంటుందని ఇప్పటికే ఈ సంస్థ నిరూపించింది. ఈ సంస్థ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టులలో యూనిట్లు కొన్న వారు చెబుతున్న మాట ఇది. ‘నేల తల్లిని నమ్మితే నష్టమే ఉండదు’ అన్న మాటను వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ నూరుశాతం నిజం చేసి చూపిస్తోంది.





















